MA Sharif: శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

AP Ex Legislature Chairman MA Sharif sensational Comments | AP News Today
x

శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

Highlights

MA Sharif: 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమి ఏర్పడాలి

MA Sharif: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవసభలో శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమిగా పోటీ చేస్తాయని అన్నారు. దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పని చేసి గెలిపించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలు అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో ఓటుకు రెండు నుంచి మూడు వేలు ఇవ్వవచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా అమరావతి అభివృద్ధి జరగాలన్నా మళ్లీ చంద్రబాబు సీఎం కావాల్సిందే అని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories