చంద్రబాబుకు లేఖ రాసిన డీజీపీ

చంద్రబాబుకు లేఖ రాసిన డీజీపీ
x
Highlights

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిన తరువాత, ఆ దాడి చేసింది వైసీపీ నేతలేనని,...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిన తరువాత, ఆ దాడి చేసింది వైసీపీ నేతలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ ఏపీ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈలేఖపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రత్యుత్తరమిచ్చారు. చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని కోరారు.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించామని తెలిపారు. వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవావస్తమని డీజీపీ లేఖలో వివరించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories