Andhra Pradesh: సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..ఆరోగ్యశ్రీలోకి బ్లాగ్ ఫంగ‌స్

YS Jagan Review Meeting
x

 వైఎస్ జగన్‌ ఫైల్ ఫోటో 

Highlights

Andhra Pradesh: కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

Andhra Pradesh: కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. క‌ర్ఫ్యూ పొడిగింపు, క‌రోనా రోగుల‌కు ప‌డ‌క‌లు, ఆక్సీజ‌న్, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు. ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులు చేర్చాల‌ని నిర్ణ‌యించారు. ఆ వ్యాధికి చికిత్స చేసే ఆస్పత్రులను నోటిఫై చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు. సీఎం స‌మీక్షా స‌మావేశంలో కీల‌క అంశాలు.. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కర్ఫ్యూ విధించి కేవలం 10 రోజులే అయ్యిందని, కర్ఫ్యూ కనీసం 4 వారాలపాటు ఉంటేనే సరైనా ఫలితాలు వస్తాయని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాగా డయాబెటిక్, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించం.. ఆ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశం చేశారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం జ‌గ‌న్. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలని ఆదేశించారు.

గ్రామిణ ప్రాంతాల్లో క‌రోనా కేసులు, బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెర‌గ‌కుండా దృష్టి సారించాల‌ని తెలిపారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసుత్తం 625 కోవిడ్‌కేర్‌ ఆస్పత్రులలో 47,825 బెడ్లు ఉన్నాయని, వాటిలో 38,492 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, వారిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు.

కోవిడ్‌ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు. 23,463 నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు. 17,246 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు. 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోని 52,471 బెడ్లలో 17,417 ఆక్యుపైడ్‌ అని వారు వివరించారు.

రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నుల కేటాయించగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో కలిపి రోజూ 590 మెట్రిక్‌ అన్నుల నుంచి 610 టన్నుల వరకు ఆక్సీజన్‌కు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 80 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్‌ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అదే విధంగా రోజూ కనీసం 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ను బళ్లారి నుంచి సరఫరా చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు.

రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్‌ఓ కంటైనర్లు రాగా, మరో రెండు కంటైనర్లు కూడా వస్తున్నాయని వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పుడు అత్యవసరమైన వాటిలో 7,32,542 ఎన్‌–95 మాస్క్‌లు, 7,55,395 పీపీఈ కిట్లు, 44,11,353 సర్జికల్‌ మాస్క్‌లతో పాటు, 23,382 రెమిడిసివిర్‌ ఇంజక్షన్ల స్టాక్‌ ఉండగా, ఇంకా 8 లక్షల ఇంజక్షన్లు మైలాన్‌ నుంచి. మరో 50 వేలు రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి సేకరించేందుకు ఆర్డర్‌ ప్లేస్‌ చేయడం జరిగిందని అధికారులు వివరించారు.:

కేంద్రం నుంచి మొత్తం 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా, వాటిలో కోవీషీల్డ్‌ 62,60,400 వ్యాక్సిన్లు కాగా, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు 13,39,560 అని అధికారులు వెల్లడించారు. ఇక ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రానికి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా, అంత కంటే ఇంకా ఎక్కువగా 8,90,360 డోస్‌లు సేకరించామని వారు తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు 2,27,490 కేటాయించగా, కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories