ఎస్సై అర్జునరావును అభినందించిన సీఎం జగన్

ఎస్సై అర్జునరావును అభినందించిన సీఎం జగన్
x
si arjunarao
Highlights

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్జునరావుని ప్రశంసించారు.ప్రస్తుతం సీఎం జగన్‌ కాన్యాయ్‌ పైలెట్‌ ఆపీసర్‌గా విధులు

కృష్ణలంక సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లక్ష్మి అనే మహిళను ఎస్సై అర్జునరావు కాపాడిన సంగతి తెలిసిందే.. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించిన అర్జునరావు ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకి ప్రాథమిక చికిత్స అందించారు. ఎస్సై చేసిన సాహసానికి నెటిజన్లతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్జునరావుని ప్రశంసించారు... ప్రస్తుతం సీఎం జగన్‌ కాన్యాయ్‌ పైలెట్‌ ఆపీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అర్జునరావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆయనని అభినందించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ మెడల్‌కు రికమెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories