CM Chandrababu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: పోలవరం, జల జీవన్ మిషన్‌పై కీలక చర్చలు

AP CM Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీబిజీగా సాగుతోంది.

Arun Chilukuri
Published on: 10 Feb 2026 11:12 AM IST
CM Chandrababu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: పోలవరం, జల జీవన్ మిషన్‌పై కీలక చర్చలు
X

AP CM Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీబిజీగా సాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిన కీలక పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సహకరించాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు తీరును చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఏపీ సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story