AP Budget 2021: కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌- గవర్నర్‌

AP Budget 2021: కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌- గవర్నర్‌
x

AP Budget 2021: కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌- గవర్నర్‌

Highlights

AP Budget 2021: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది.

AP Budget 2021: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. 2021-22 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు.

బడ్జెట్ సెషన్ ముందు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముఖ్యాంశాలు

- దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది

- సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి

- దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది

- కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం

- కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం

- క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం

- ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు

- 900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరాం

- అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం

- ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు నా సెల్యూట్

- క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై తీవ్ర ప్ర‌భావం

- ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశాం

- న‌వ‌ర‌త్నాలు ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం

- ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం.

- ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం.

- ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది.

- ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం.

- జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం.

- కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది.

- 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది.

- రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది.

- వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాలు

- 44.5ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు జ‌గ‌న‌న్న అమ్మ ఒడి

- జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా 47ల‌క్ష‌ల మందికి కిట్ లు

- రూ.1600కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరుముద్ద‌

- వ‌చ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధ‌న‌

- నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్ల‌లో మ‌ర‌మ్మ‌తులు

- అంగ‌న్ వాడీల ద్వారా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం

- విద్యాశాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714కోట్లు కేటాయింపు

- 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచాం

- కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం

- ఏపీలో 95శాతం జ‌నాభాకు ఆరోగ్య‌శ్రీ వ‌ర్తిస్తుంది

- 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం

- రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

- అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం

- 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ పంపిణీ

- అర్హులైన వారంద‌రికీ ఇంటి స్థ‌లాలు ఇచ్చాం

- పేద‌ల‌కు రెండు ద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం

- పెన్ష‌న్ల కింద ప్ర‌తి నెల 1వ తేదీనే రూ.1407కోట్లు సాయం

- వైయ‌స్ఆర్ కాపు నేస్తం ద్వారా 419కోట్ల సాయం

- 45ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు రూ.15వేలు సాయం

- సాగునీటి ప్రాజెక్టుల‌కు పూర్తికి అధిక ప్రాధాన్యత‌

- క‌ర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చాం

- జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ.1049కోట్లు కేటాయింపు

- స్కూళ్ల ఆధునీక‌ర‌ణ‌కు రూ.3948కోట్లు కేటాయింపు

- జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ.4879.30కోట్లు కేటాయింపు

- అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ.13,022కోట్లు కేటాయింపు

Show Full Article
Print Article
Next Story
More Stories