రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమరం.. 14న పయ్యావుల కేశవ్ ‘వజ్ర’ బడ్జెట్!

AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వరుస సమీక్షలతో సభను సిద్ధం చేస్తున్నారు.
సమావేశాల షెడ్యూల్ ఇలా..
రేపు ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటపాటు సాగే ఈ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించనున్నారు.
ఉదయం 11:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ భేటీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
స్పీకర్ అయ్యన్న వరుస సమీక్షలు
సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈరోజు మధ్యాహ్నం నుంచి కీలక భేటీలు నిర్వహించనున్నారు:
మధ్యాహ్నం 2:30 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించే క్రీడా, సాంస్కృతిక పోటీలపై మంత్రులతో సమీక్షించనున్నారు.
3:30 గంటలకు సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి సభ్యుల ప్రశ్నలు, ప్రభుత్వం ఇచ్చే సమాధానాలపై చర్చించనున్నారు.
సాయంత్రం 4:30 గంటలకు డీజీపీ సహా ఉన్నత పోలీస్ అధికారులతో అసెంబ్లీ భద్రతపై కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో ఈ సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



