Tirumala: తిరుమల వేదపాఠశాలలో ఆగని కరోనా కేసులు

Tirumala: తిరుమల వేదపాఠశాలలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదు.

Arun Chilukuri
Published on: 16 March 2021 2:31 PM IST
Another 10 Persons tests Positive for Coronavirus in Vedic School at Tirumala
X

Tirumala: తిరుమల వేదపాఠశాలలో ఆగని కరోనా కేసులు

Tirumala: తిరుమల వేదపాఠశాలలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదు. ఇవాళ ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వేదపాఠశాలకు టీటీడీ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో 357 మంది విద్యార్థులు సొంతగ్రామాలకు వెళ్లిపోయారు.

మార్చి 10న వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూడటంతో.. సోమవారం 75 మందికి కరోనా టెస్టులు చేయగా.. మరో 10 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి వేద పాఠశాలలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 420 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story