బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించిన సీఎం జగన్

బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించిన సీఎం జగన్
x
Highlights

బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే...

బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఈ రోజు ప్రకటించింది. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను మంత్రులు తాడేపల్లిలో వెల్లడించారు. వీటిలో 12 మంది డైరెక్టర్లతో పాటు ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌లను ప్రభుత్వం నియమించింది. అంతే కాక మహిళలకు 50శాతం రిజర్వేషన్లను కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇతరులు పాల్గొన్నారు.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు జాబితాలోకెళితే అనంతరపురం జిల్లా నుంచి కుంచిటి వక్కలిగ : డా.నళిని, రజక కార్పొరేషన్‌ : రంగన్న, కురుబ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ బాబు, తొగట కార్పొరేషన్‌: గడ్డం సునీత.

చిత్తూరు జిల్లా నుంచి ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్, వన్యకుల క్షత్రియ: కె. వనిత, పాల ఎకరి: టి. మురళీధర్, ఈడిగ : కె.శాంతి.

కడపజిల్లా నుంచి యాదవ: హరీష్‌కుమార్, సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ, నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య, నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి, పద్మశాలీ: విజయలక్ష్మి.

తూర్పుగోదావరి జిల్లా నుంచి గాండ్ల : భవాణీ ప్రియ, అయ్యారక: రాజేశ్వరం, పెరిక : పురుషోత్తం గంగాభవానీ, అగ్నికుల క్షత్రియ: భండన హరి.

గుంటూరు జిల్లా నుంచి షేక్ : షేక్ యాసీన్, కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ, వడ్డెర: దేవల్లి రేవతి, కుమ్మరి శాలివాహన: పురుషోత్తం.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి శెట్టి బలిజ: తమ్మయ్య, సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి, అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు, అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న.

కృష్టాజిల్లా నుంచి విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్, భట్రాజు: గీతాంజలి దేవి, వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్, గౌడ: మాడు శివరామకృష్ణ.

ప్రకాశం జిల్లానుంచి ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి, చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్, మేదర : లలిత నాంచారమ్మ, దేవాంగ : సురేంద్రబాబు.

విశాఖపట్నం నుంచి మత్స్యకార : కోలా గురువులు, నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ, నగరాల: పిల్లా సుజాత, గవర: బొడ్డేడ ప్రసాద్, యాత: పి.సుజాత.

కర్నూలు జిల్లా నుంచి వాల్మీకి బోయ: డా.మధుసూదన్, వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్, కుమి/కరికల భక్తుల: శారదమ్మ.

శ్రీకాకుళం జిల్లా నుంచి కళింగ: పేరాడ తిలక్, శ్రీసైన: చీపురు రాణి, కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు, కురకుల/పొండర: రాజపు హైమావతి, పోలినాటి వెలమ: కృష్ణవేణి, రెడ్డిక: లోకేశ్వరరావు.

నెల్లూరు జిల్లా నుంచి ముదిరాజ్: వెంకటనారాయణ, ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా, బొందిలి : కిషోర్ సింగ్, జంగం: ప్రసన్న.

విజయనగరం జిల్లా నుంచి శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్, తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్, దాసరి: రంగుముద్రి రమాదేవి, కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories