జగనన్న విద్యాకానుక ప్రారంభం!

జగనన్న విద్యాకానుక ప్రారంభం!
x
Highlights

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం లోని పునాదిపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం లోని పునాదిపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న 1 -10 వరకు చెందిన 42.34 లక్షల మంది విద్యార్ధులకు ఈ కీట్లు పంపిణి చేయనున్నారు. ఒక్కో కిట్లో 3 జతల యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్, మాస్క్ ఉంటాయి.. నవంబర్ రెండు లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ కీట్లు అందనున్నాయి..

ఇక ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని అన్నారు. అందుకు ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనందంగా ఉందని అన్నారు. రూ. 650కోట్ల ఖర్చుతో జగనన్న విద్యాకానుకను అందిస్తున్నట్టుగా జగన్ వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్ధి గొప్పగా చదువుకోలాని ఆశిస్తున్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనున్నట్టుగా జగన్ తెలిపారు. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టమన్న జగన్, ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లలో రావాలని జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories