సీఎం జగన్‌తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

సీఎం జగన్‌తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
x
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు భేటీ అయి.. చంద్రబాబు పాలనలో అవినీతిపై నివేదిక ఇచ్చింది.

గతంలో కరెంటు కొనుగోలు, సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను తయారు చేసింది. ఈ ఉదయమే ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మంత్రివర్గ సమావేశం ముగిశాక ఈ నివేదికను బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories