Visakhapatnam: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Visakhapatnam: ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2025 2:04 PM IST
Visakhapatnam: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
X

Visakhapatnam: ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్సిటీ కనీసం వసతులు కల్పించడాలని డిమాండ్ చేస్తూ వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వీసీ రాజశేఖర్ శాంతియుత చర్చకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను వీసీగా ఛార్జ్ తీసుకుని 6 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. విద్యార్థులు చర్చలకు రావాలని రాజకీయాలు చేయాలని చూస్తే.. మీ ఇష్టం అంటూ వీసీ సమాధానం ఇచ్చారు. వీసీ వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story