ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ
ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్లో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ప్రభుత్వంతో సంప్రదించాక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధమైన బాధ్యతన్న నిమ్మగడ్డ ఏపీలో కరోనా అదుపులోకి వస్తోందని కరోనా కట్టడికి డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో 10 వేలు కేసులుంటే ఇప్పుడు 753కి తగ్గాయని అన్నారు నిమ్మగడ్డ.
Next Story




