ఏపీ ప్రభుత్వ రంగుల ఉత్తర్వులపై మళ్ళీ హైకోర్ట్ అభ్యంతరం!

ఏపీ ప్రభుత్వ రంగుల ఉత్తర్వులపై మళ్ళీ హైకోర్ట్ అభ్యంతరం!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసేలా ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను న్యాయస్థానం రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసేలా ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను న్యాయస్థానం రద్దు చేసింది.రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గత రెండు నెలల కిందటే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

అయితే, ఏపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా మరో రంగును వేసిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై తాజాగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో సర్కారు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని చెప్పింది. కాగా ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories