వైద్య విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!

వైద్య విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!
x
Highlights

ప్రయివేట్ వైద్య విద్యార్ధుల ఫీజులను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

AP Govt Reduced Medical Fees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఫీజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. . 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.12,155గా ఉన్న ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా ట్యూషన్‌ ఫీజును రూ.15 వేలకు పెంచారు. రూ.13,37,057గా ఉన్న బీ కేటగిరీ ఫీజును రూ. 12లక్షలకు తగ్గించారు. గతంలో సీ కేటగిరీ ఫీజు రూ.33,07, 500 కాగా.. దీనిని రూ. 36 లక్షలుగా నిర్ణయించారు. సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15లక్షలకు సవరించారు.ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌,మైనారిటీ, నాన్‌మైనారిటీ కళాశాలలకు నూతన ఫీజులు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు.

ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా.. ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మొత్తం 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 14 డెంటల్‌ కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేటు కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్‌ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్‌ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories