ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1.. జగన్ సర్కార్ మరో నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1.. జగన్ సర్కార్ మరో నిర్ణయం!
x
Highlights

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. కాకపోతే విభజన జరిగిన తేదీ జూన్ 2 నుంచి నవనిర్మాణ దీక్ష చేస్తూ వస్తున్నారు.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు నవంబర్ 1 వతేదీన జరుపుకునే వారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 వ తేదీన అపాయింట్ డే గా ప్రకటించి ప్రతి సంవత్సరం 2 వ తేదీ నుంచి జూన్ 8 మారకూ నవ నిర్మాణ దీక్ష పేరుతొ ఉత్సవాలు చేస్తూ వచ్చేది గత ప్రభుత్వం. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు.

ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని ఎప్పటిలానే నవంబర్ 1 వ తేదీనే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించబోతోంది. ఈమేరకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించి.. దాన్ని రాష్ట్ర రాజధానిలోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించాలని ఆదేశాలిస్తూ జీవో విడుదల చేసింది. ఈ వేడుకను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ను, సభ్యులుగా యువజనాభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌, గుంటూరు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు, ఏపీటీడీసీ ఎండీ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌, యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌లను, కన్వీనర్‌గా ప్రోటోకాల్‌ విభాగం డిప్యూటీ కార్యదర్శిని నియమించింది.

తొలుత భాషాప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా 1953లో అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాత 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే

Show Full Article
Print Article
Next Story
More Stories