ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. విద్యుత్‌ కారిడార్‌ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయలేదని కలెక్టర్‌పై విద్యుత్‌ నియంత్రణ మండలి‌ సీరియస్‌ అయింది.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ).. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. విద్యుత్‌ కారిడార్‌ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయలేదని కలెక్టర్‌పై విద్యుత్‌ నియంత్రణ మండలి‌ సీరియస్‌ అయింది. ఈ షోకాజ్ నోటీసుపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2017లో ఏపీ ట్రాన్స్‌కో పొదిలి–పర్చూరు మధ్య 220 కేవీ విద్యుత్‌ లైన్‌ వేసింది. ఈ క్రమంలో సుబాబుల్‌ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా లైన్‌ వెళ్లింది.

దాంతో సదరు రైతు ఇందుకోసం 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం ఇవ్వాలని కోరాడు. అయితే దీనిపై అధికారులు పెద్దగా పట్టించుకోకపోగా పరిహారం కూడా ఇవ్వలేదు. దాంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వెంకట శేషయ్య జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు అయినా ఫలితం లేకపోవడంతో.. ఈ ఏడాది మార్చి 5న వెంకట శేషయ్య ఏపీఈఆర్‌సీని ఆశ్రయించాడు. దీంతో విద్యుత్‌ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కలెక్టర్‌కు ఏపీఈఆర్‌సీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories