సోషల్ మీడియాలో మెసేజ్ లు తొలగించినా నేరమే : ఏపీ డీజీపీ

సోషల్ మీడియాలో మెసేజ్ లు తొలగించినా నేరమే : ఏపీ డీజీపీ
x
DGP Goutam Sawang(file photo)
Highlights

సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తే కుదరదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.

సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తే కుదరదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవాలు అయితే కఠిన చర్యలు తప్పవని అయన చెప్పారు. ప్రభుత్వం మీద గాని ప్రభుత్వ అధికారుల మీద కించపర్చుతూ పలు వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు.అంతేకాక సోషల్ మీడియాలో మహిళల చిత్రాలను పంపించినా అసభ్య వ్యాఖ్యలు మాట్లాడినా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషించినా ,క్రిమినల్ పేర్లను సంబోదిస్తూ వ్రాసినా కూడా కేసులు నమోదుచేస్తామని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఒక వ్యక్తి గురించి కించపర్చుతూ వ్యాఖ్యలు చేసి తొలిగించినా కేసులు నమోదు చేస్తామని, తమ దగ్గర ఐటీ టెక్నాలజీ ఉందని దీనివలన తొలిగించిన మెసేజ్ లను కూడా పరిగణంలోనికి తీసుకుని కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

వాట్సప్ గ్రూపుల విషయంలో..

వాట్సప్ గ్రూపులలో కూడా నిరాధారమైన వార్తలు రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని డిజీపీ గౌతం సవాంగ్ అన్నారు. వాట్సప్ గ్రూపులలో వ్యక్తి గత దూషణలు చేస్తూ సంభాషించినా, దుర్బషలాడినా గ్రూప్ అడ్మిన్ తో పాటు గ్రూప్ సభ్యుల మీద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వార్తలు గ్రూపుల్లో రాసే సమయంలో 9071666667 నెంబర్ కు సంప్రదించి ఆ వార్త నిజమో కాదో పరిశీలించుకోవచ్చని సూచించారు. లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని దీని కట్టడికి అన్ని కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories