జగన్ సర్కార్ మరో పథకం.. 2 లక్షలపైగా మహిళలకు లబ్ధి

జగన్ సర్కార్ మరో పథకం.. 2 లక్షలపైగా మహిళలకు లబ్ధి
x
YS Jagan (File Photo)
Highlights

మహిళల కోసం మరో జగన్ సర్కార్ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకం ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు...

మహిళల కోసం మరో జగన్ సర్కార్ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకం ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఈ ఏడాది లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 2.36 లక్షల మహిళలకు లబ్ధిపొందనున్నరు. ఈనెల 24 బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 2019–20కి సంబంధించి ఈనెల 24వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది. గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీక రిస్తారు.

ఈ పథకానికి అర్హత :

* కుటుంబ వార్షిక ఆదాయం.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు.

* కుటుంబానికి మూడు ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.

* పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.

* కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే వర్తించదు.

* ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది.

* కారు, టాక్స్ చెల్లింపుదారులకు వర్తించదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories