Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది.

Arun Chilukuri
Published on: 30 Sept 2025 7:07 AM IST
Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
X

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఉదయం వీరిద్దరూ న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.

అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జీఎస్టీ 2. 0 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించనున్నారు. మరోవైపు నారా లోకేశ్ సైతం న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story