ప్రభుత్వ భవనాలకు రంగుల కేసులో కోర్టుకు ఏపీ సీఎస్

ప్రభుత్వ భవనాలకు రంగుల కేసులో కోర్టుకు ఏపీ సీఎస్
x
Neelam Sahni (File Photo)
Highlights

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని...

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హైకోర్టుకు హాజరయ్యారు. తమపై కోర్టు పేర్కొన్న కోర్టు ధిక్కరణ అంశానికి తమ వివరణ ఇచ్చారు.

నీలం సాహ్నితో పాటు.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. కోర్ట్ ఆదేశాలు బేఖాతరు చేశారని భావించిన న్యాయస్థానం... కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీంతో ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజరయ్యారు.

విషయం ఇదీ..

వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థాయం రంగులను తొలగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వం 620 జీవో తీసుకొచ్చి గతంలో వేసిన రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు తెలిపింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్ట్.. కోర్టు ధిక్కారణగా భావించి ఉన్నతాధికారులను తమ ముందు హాజరు కావాలని ఆదేశాలను జారీచేసింది. ఈ అంశంపై వివరణ చ్చేందుకు సీఎస్ నీలం సహానితో పాటు ద్వివేది, గిరిజాశంకర్‌ కోర్టుకు హాజరయ్యారు.

వెనక్కి తగ్గని సర్కార్..

మరోవైపు జగన్‌ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వద్దని హైకోర్టు రెండుసార్లు చెప్పినా సరే… గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై తగ్గకూడదని నిర్ణయించుకుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడుగా ఎర్రమట్టి రంగును చేర్చుతూ జారీ చేసిన జీవో నంబర్‌ 623ను రద్దుచేసింది. అయినప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కాగా, గ్రామ సచివాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన రంగులను వేసారని గతంలోనే హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏదైనా అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టు ఈనెల 22న స్పష్టమైన తీర్పు చెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories