CM Jagan: సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

Andhra Pradesh Cabinet Meeting Strated in Secretariat
x

ప్రారంభం అయిన కాబినెట్ సమావేశం (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

CM Jagan: ఈ సమావేశంలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కొవిడ్-19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై

CM Jagan: సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కొవిడ్-19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. విజయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు వైద్యానికి సంబంధించి అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories