దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానం.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రశంసలు

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానం.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రశంసలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. టీబీ నిర్మూలనలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. టీబీ నిర్మూలనలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 2019లో 24.04 లక్షల టీబీ కేసులను ఉన్నాయని, 2018తో పోల్చితే కేసుల సంఖ్య 14 శాతం పెరిగిందని తెలిపింది. అందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే టీబీ వార్షిక నివేదిక–2020ని విడుదల చేశారు.

నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌టీఈపీ)2019లో అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. 50 లక్షలకు పైబడిన జనాభా గల పెద్ద రాష్ట్రాల కేటగిరీల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, టీబీ నిర్మూలనలో ఏపీ రెండో స్థానం లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర క్షయ నిర్మూలనా ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ రామారావు. గతేడాది రాష్ట్రంలో 99,904 మంది టీబీ రోగులను గుర్తించి వారికి చికిత్స అందించామని, ఇందులో 92 శాతం రికవరీ రేటు నమోదైనట్లు అధికారి డాక్టర్‌ రామారావు చెప్పారు. అయితే 50 త్రిపుర, నాగాలాండ్‌ లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న రాష్ట్రాల కేటగిరీలో అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.

టీబీ కేసుల సంఖ్య 2017లో దాదాపు 10 లక్షల మేర ఉండగా ఇప్పుడది 2.9 లక్షలకు తగ్గింది. 2018తో పోలిస్తే హెచ్‌ఐవీ పరీక్షలు చేసిన టీబీ పేషెంట్ల 14 శాతం పెరిగి 81 శాతానికి చేరింది. టీబీ పేషెంట్లకు నిక్షయ్‌ పోషణ్‌ యోజన ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపొందిందని వెల్లడించింది. అన్ని గ్రామాల్లో 4.5 లక్షల టీబీ పేషెంట్లకు డాట్‌ కేంద్రాల ద్వారా దాదాపు చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ స్థిరమైన వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories