సీఎం జగన్ ను కలిసిన ఆనం రామనారాయణరెడ్డి!

సీఎం జగన్ ను కలిసిన ఆనం రామనారాయణరెడ్డి!
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ లాబీల్లో ముఖ్యమంత్రితో ఆనం భేటీ అయ్యారు. కాసేపు ఇద్దరి మధ్య మాటామంతి జరిగినట్టు తెలుస్తోంది. కాగా గతకొంతకాలంగా జిల్లా నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న ఆనం ఇటీవల నెల్లూరులోని కొందరు వైసీపీ నేతలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డాగా ఉందని, ఇక్కడ ఎలాంటి మాఫియాలైనా సరే దొరుకుతారు, శాండ్, క్రికెట్ బెట్టింగ్,

భూకబ్జా గ్యాంగ్ స్టార్స్, లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలన్నీ ఇక్కడ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి' అని ఆనం వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. షోకాజ్ నోటీసు ఇవ్వాలని అనుకున్నా విరమించుకుంది. తాజాగా అసెంబ్లీ లాబీల్లో సీఎం జగన్ తో ఆనం భేటీ అవ్వడంతో ఈ ఎపిసోడ్ కు పులుస్టాప్ పడినట్టే అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories