Ambati Rambabu: టీడీపీ కేసులు పెట్టే పార్టీ.. వైసీపీ కేసులు తీసేసే పార్టీ

Ambati Rambabu: కాపులకు జగన్ మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారు

Jyothi
Published on: 17 July 2023 8:14 AM IST
Ambati Rambabu Comments On TDP
X

Ambati Rambabu: టీడీపీ కేసులు పెట్టే పార్టీ.. వైసీపీ కేసులు తీసేసే పార్టీ

Ambati Rambabu: కాపులకు వైఎస్సార్‌ సీఎం జగన్‌లు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపుల కోసం ముద్రగడ యోధుడిలా పోరాడితే.. అలాంటి నేతపై కేసులు పెట్టి టీడీపీ ఇబ్బందులకు గురిచేసిందన్నారు. నెల్లూరులో మంత్రులు అంబటి రాంబాబు, మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలు కాపు ప్రతినిధులతో కలిసి కాపు భవనాన్ని ప్రారంభించారు. కాపులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని...6కోట్ల రూపాయలతో భవనాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story