Ambati Rambabu: బెయిల్ వచ్చినంత మాత్రన న్యాయం గెలిచినట్లు కాదు
Ambati Rambabu: బాబు బెయిల్పై టీడీపీ శ్రేణులు, నాయకులు రెచ్చగొట్టడం సరికాదు
Ambati Rambabu: బెయిల్ వచ్చినంత మాత్రన న్యాయం గెలిచినట్లు కాదు
Ambati Rambabu: చంద్రబాబు బెయిల్ మంజూరుపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిందని అంబటి రాంబాబు అన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రన న్యాయం గెలిచినట్లు కాదని అంబటి రాంబాబు విమర్శించారు. కేవలం కంటి ఆపరేషన్ కోసమే కోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. బాబు బెయిల్పై టీడీపీ శ్రేణులు, నాయకులు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ జెండా పీకేసారు. ఎన్నికల తర్వాత ఆంధ్రాలో కూడా పీకేసే పరిస్థితి నెలకొందని అంబటి రాంబాబు అన్నారు.
Next Story




