Tirupati: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం

Tirupati: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం
x

Tirupati: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం

Highlights

Tirupati: తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా రెడీ అయ్యింది. పోలింగ్‌కు సర్వం సిద్దమైంది.

Tirupati: తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా రెడీ అయ్యింది. పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. కరోనా ఉధృతి నేపథ్యంలో సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు ఈసీ తెలిపింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కేంద్ర,రాష్ట్ర బలగాలతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపింది ఎన్నికల సంఘం.

ఆంధ‌్రప్రదేశ్‌లో ఉత్కంఠ కలిగిస్తున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌కు అంతా రెడీ అయ్యింది. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17 లక్షల 10 వేల 699. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 8 లక్షల 38 వేల 540. మహిళలు 8 లక్షల 71 వేల 943. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, చిత్తూరు జిల్లాలో మూడున్నాయి.

ఇక భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2 వేల 470. సర్వేపల్లి నియోజకవర్గంలో 339 సెంటర్లు, గూడూరు 366, సూళ్లూరుపేట 343, వెంకటగిరు 366, తిరుపతి 382, శ్రీకాళహస్తి 362, సత్యవేడు 312 కేంద్రాలు. 877 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. నియోజకవర్గంలో 144 సెక్షన్‌ విధించారు. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దాదాపు 3 వేలమంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. అలాగే కేంద్రబలగాలు కూడా పహారా కాస్తాయి. పోలింగ్ సెంటర్లలో భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికలకు వినియోగిస్తున్న సిబ్బంది 10,850.

కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఎక్కువమంది ఓటర్లున్న కేంద్రాలను రెండుగా విభజించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజేషన్‌ కోసం ప్రత్యేక సిబ్బంది వుంటారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేశామన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మొత్తం 28 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నోటా గుర్తుతో పాటు మొత్తం 29 సింబల్స్‌తో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించేందుకు 288 మంది సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం.

Show Full Article
Print Article
Next Story
More Stories