3 రాజధానుల నిర్ణయంపై ముందస్తుగా లీకులు..?

3 రాజధానుల నిర్ణయంపై ముందస్తుగా లీకులు..?
x
Highlights

మూడు రాజధానులపై నిర్ణయం జరిగిపోయిందా..? వైసీపీ నేతల ప్రకటనలు దేనికి సంకేతం..? రైతులను ఆదుకుంటామనే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు..? అమరావతి ప్రాంత...

మూడు రాజధానులపై నిర్ణయం జరిగిపోయిందా..? వైసీపీ నేతల ప్రకటనలు దేనికి సంకేతం..? రైతులను ఆదుకుంటామనే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు..? అమరావతి ప్రాంత రైతులను, రాష్ట్ర ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారా..?

కాసేపట్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేయబోతున్నారన్నది నిర్ణయమైంది. ప్రభుత్వం తీసుకోబోతున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం ముందస్తుగానే లీకులిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లక్ష కోట్లకు పైగా రాజధాని కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని తేల్చిచెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ఇటు మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సచివాలయం మాత్రమే తరలివెళ్తుందంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాజధాని అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదని కుండబద్దలు కొట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు.

అయితే వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలతో రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. మందాడం మండిపోతోంది. తుళ్లూరు, ఉద్దండరాయపాలెంలో రైతులు చీకట్లో కూడా రోడ్డెక్కారు. ఓ వైపు 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా లెక్కచేయలేదు. దీంతో ముందస్తుగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు వాటర్ కెనెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగాలకు కూడా వెనకాడటం లేదు. ఏదేమైనా డిసెంబర్‌ చలిలో వేడెక్కిస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం మరికొన్ని గంటల్లో చోటు చేసుకోబోతంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories