Gudivada Amarnath: రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన

Gudivada Amarnath: జగన్ సర్కార్‌ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుంది

Dhatripriya
Published on: 21 Jan 2023 3:03 PM IST
Administration As Vizag Capital In Two Months
X

Gudivada Amarnath: రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన 

Gudivada Amarnath: రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన జరుగుతుందని అందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో డిజిటల్ సేవలను ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ విశాఖలో 16 ఐటీ పార్క్‌లు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఐటీ పార్క్‌లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 15 రోజుల్లో నగరంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభమౌతుందని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story