విజయవాడ దివ్య కేసులో నిందితుడు అరెస్ట్

విజయవాడ దివ్య కేసులో నిందితుడు అరెస్ట్
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ కేసులోని నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ కేసులోని నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 15 నుంచి నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. నాగేంద్రబాబు కోలుకుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసిన తర్వాత.. పోలీసులు విజయవాడకు తరలించి విచారిస్తున్నారు.

దివ్య హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నాగేంద్ర వెల్లడించిన మరో ఆరుగురు స్నేహితులను కూడా విచారించనున్నారు. ఇప్పటికే దివ్య హత్య కేసులో 45 మంది సాక్షులనుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఛార్జ్‌షీట్‌, రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. ఇవాళ మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో నిందితుడిని పోలీసులు హాజరుపర్చనున్నారు. సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

విజయవాడలోని క్రీస్తురాజపురానికి చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో బలైన సంగతి తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి ఆమెను కిరాతకంగా పొడిచి చంపేశాడు. అనంతరం తామిద్దరం వివాహం చేసుకున్నామని.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించామని చెప్పుకొచ్చాడు. అయితే ఆమెను ప్లాన్ ప్రకారమే నాగేంద్ర కిరాతకంగా చంపేసినట్లు పోలీసులు తేల్చారు.

ఆమె ఒంటిపై 13 కత్తిపోట్లు ఉండడం కూడా సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకుంటే 13 కత్తిపోట్లు ఉంటాయా? అంటూ సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బాధితురాలి కుటుంబాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories