తహశీల్దార్ హసినాబీ కోసం ఏసీబీ వేట.. కీలక ఆధారాలు లభ్యం

తహశీల్దార్ హసినాబీ కోసం ఏసీబీ వేట.. కీలక ఆధారాలు లభ్యం
x
Highlights

కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ హసినాబీ కోసం ఏసీబీ వేట కొనసాగుతోంది. హసినాబీ సూచన మేరకు ఆమె బినామీ ఓ వ్యక్తి నుంచి 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా...

కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ హసినాబీ కోసం ఏసీబీ వేట కొనసాగుతోంది. హసినాబీ సూచన మేరకు ఆమె బినామీ ఓ వ్యక్తి నుంచి 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా పట్టుబడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె పరారీలో ఉన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్ లో హసినాబీ ఆశ్రయం తీసుకున్నారన్న అనుమానంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య సహకారంతో హసినాబీ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 8 నుంచి గిడ్డయ్య మెడికల్ లీవ్ లో ఉన్నారు. గిడ్డయ్యతో హసినాబీ సహజీవనం చేస్తునట్లు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories