AP News: సీఎం జగన్‌పై దాడి ఘటనలో 307 సెక్షన్‌ కింద కేసు నమోదు

AP News: జగన్‌పై దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణ

Shashank Gullapelli
Published on: 14 April 2024 5:46 PM IST
A Case Was Registered Under Section 307 In The Case Of Attack On CM Jagan
X

AP News: సీఎం జగన్‌పై దాడి ఘటనలో 307 సెక్షన్‌ కింద కేసు నమోదు

AP News: సీఎం జగన్‌‌పై దాడి ఘటనతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేపటి నుంచి జగన్ బస్సు యాత్రకు భద్రత పెంచే అవకాశం ఉంది. జగన్‌పై దాడి ఘటనలో 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. స్కూల్, టెంపుల్‌ మధ్య ఓపెన్‌ ప్లేస్‌ నుంచి.. జగన్‌పై దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణ వచ్చారు. రాయితో దాడి చేసినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిలో కొన్ని ఆధారాలను సేకరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story