ఏపీలో కొత్తగా 831 పాజిటివ్‌ కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 831 పాజిటివ్‌ కేసులు నమోదు
x
Highlights

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కొంచెం పెరిగింది. నిన్న 545 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. తాజాగా 831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో...

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కొంచెం పెరిగింది. నిన్న 545 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. తాజాగా 831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8లక్షల 64వేల 674కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు 8లక్షల 45 వేల 39 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వేల 673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇవాళ వైరస్‌ బారిన పడి ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారిసంఖ్య 6వేల 962కి చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories