ఏపీలో మరో 79 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో మరో 79 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 79 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,066...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 79 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,066 శాంపిల్స్‌ని పరీక్షించగా 79 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, కర్నూలు జిల్లాలో ఒక్కరూ మరణించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 3279. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 68. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,244కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నారు.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories