ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ని పరీక్షించగా 76 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. తాజా కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 తమిళనాడు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోలుకున్న వారి సంఖ్య 2169కి చేరింది. ప్రస్తుతం 885 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 64కి చేరింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories