ఏపీలో కొత్తగా మరో 2,618 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా మరో 2,618 కరోనా కేసులు
x
Highlights

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 88,780 కరోనా టెస్టులు చేయగా 2,618 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 88,780 కరోనా టెస్టులు చేయగా 2,618 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966 కి చేరుకుంది. అయితే ఇందులో 23,668 యాక్టివ్ కేసులుండగా 7,92,697 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,509 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 16 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,706కి చేరుకుంది.

కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు 3, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories