ఏపీలో 25 జిల్లాలు.. ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు !

ఏపీలో 25 జిల్లాలు.. ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు !
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు....

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. పదేళ్లలో ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావు సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గగొన్నారు. ఈ సందర్బంగా.. కేక్‌ కట్ చేసి, సీఎం వైఎస్ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories