Visakhapatnam: విశాఖలో 20 పాజిటివ్ కేసులు... అధికారులు అప్రమత్తం

Visakhapatnam: విశాఖలో 20 పాజిటివ్ కేసులు... అధికారులు అప్రమత్తం
x
Highlights

విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.

విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అత్యంత సున్నిత ప్రాంతాల్లో పటిష్ట లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు వెళ్లే మార్గాలను బారికేడ్లు పెట్టి మూసివేశారు. పోలీసుల పహారా కొనసాగుతోంది.

అక్కయ్యపాలెం సమీపంలోనే 5 కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్​జోన్ పరిధి 3 కిలోమీటర్లు పెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కయ్యపాలెంలో డీసీపీ రంగారెడ్డి, జోనల్ కమిషనర్ సింహాచలం, అర్బన్ తహసీల్దారు జ్ఞానవేణి, ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories