AP Corona Cases: ఏపీలో కరోనా మరణమృదంగం..24 గంటల్లో 118 మంది మృతి


కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పేరిగిపోతుంది.
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పేరిగిపోతుంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా వందకు తక్కువగా రావడం లేదు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది.
తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు.
#COVIDUpdates: 22/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,59,165 పాజిటివ్ కేసు లకు గాను
*13,38,460 మంది డిశ్చార్జ్ కాగా
*10,022 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,683#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RT6ipkqyMB

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



