
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,657 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,657 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,52,955 కి చేరుకుంది. అయితే ఇందులో 19,757 యాక్టివ్ కేసులుండగా 8,26,344 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,155 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 7 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6854 కి చేరుకుంది.
కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 80, చిత్తూరులో 184, ఈస్ట్ గోదావరిలో 252, గుంటూరులో 194, కడపలో 71, కృష్ణాలో 225, కర్నూల్ లో 19, నెల్లూరులో 62, ప్రకాశంలో 86, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 95, విజయనగరం 66, వెస్ట్ గోదావరి 249 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,01,048 కరోనా టెస్టులు నిర్వహించారు.
#COVIDUpdates: 14/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 14, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,50,060 పాజిటివ్ కేసు లకు గాను
*8,23,449 మంది డిశ్చార్జ్ కాగా
*6,854 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 19,757#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/llgzH22BXt

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire