ఏపీలో కొత్తగా 1,657 కరోనా కేసులు!

ఏపీలో కొత్తగా  1,657  కరోనా కేసులు!
x
Highlights

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,657 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,657 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,52,955 కి చేరుకుంది. అయితే ఇందులో 19,757 యాక్టివ్ కేసులుండగా 8,26,344 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,155 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 7 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6854 కి చేరుకుంది.

కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 80, చిత్తూరులో 184, ఈస్ట్ గోదావరిలో 252, గుంటూరులో 194, కడపలో 71, కృష్ణాలో 225, కర్నూల్ లో 19, నెల్లూరులో 62, ప్రకాశంలో 86, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 95, విజయనగరం 66, వెస్ట్ గోదావరి 249 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,01,048 కరోనా టెస్టులు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories