ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

ఏపీలో భారీగా తగ్గిన  కరోనా కేసులు!
x
Highlights

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు భారీగానే తగ్గాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,050 కరోనా టెస్టులు చేయగా 1,392 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు భారీగానే తగ్గాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,050 కరోనా టెస్టులు చేయగా 1,392 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,44,359 కి చేరుకుంది. అయితే ఇందులో 21,235 యాక్టివ్ కేసులుండగా 8,16,322 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 11 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,802కి చేరుకుంది.

కరోనా వలన కృష్ణా జిల్లాలో 5, కడపలో 2, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 84, చిత్తూరులో 105, ఈస్ట్ గోదావరిలో 341, గుంటూరులో 116, కడపలో 100, కృష్ణాలో 75, కర్నూల్ లో 36, నెల్లూరులో 76, ప్రకాశంలో 66, శ్రీకాకుళం 47, విశాఖపట్నం 42, విజయనగరం 61, వెస్ట్ గోదావరి 243 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 87,25,025 కరోనా టెస్టులు నిర్వహించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories