
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు చేయగా 1,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు చేయగా 1,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,62,213 కి చేరుకుంది. అయితే ఇందులో 14,249 యాక్టివ్ కేసులుండగా 8,41,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 11 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,938 కి చేరుకుంది.
కరోనా వలన చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి ఒక్కరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 46, చిత్తూరులో 130, ఈస్ట్ గోదావరిలో 134, గుంటూరులో 164, కడపలో 60, కృష్ణాలో 167, కర్నూల్ లో 21, నెల్లూరులో 26, ప్రకాశంలో 64, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 77, విజయనగరం 23, వెస్ట్ గోదావరి 142 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 96,15,090 కరోనా టెస్టులు నిర్వహించారు.
#COVIDUpdates: 22/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 22, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,59,318 పాజిటివ్ కేసు లకు గాను
*8,38,131 మంది డిశ్చార్జ్ కాగా
*6,938 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,249#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/btjU2AE9Mh

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire