hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'
hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'
hmtv Mathru Shakthi Awards 2026
hmtv Mathru Shakthi Awards 2026: తెలుగు నవలా రచయిత్రి డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి కి హెచ్.ఎమ్.టి.వి (HMTV) 'మాతృశక్తి అవార్డ్-2026' ప్రదానం
డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
రచనా వ్యాసంగం: డా. తంగెళ్ల శ్రీదేవి రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి. ఆమె అనేక నవలలతో పాటు కథలు, కవితలు రాశారు. ఆమె రచనలు పలు ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి
విద్య - పరిశోధన: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ పూర్తి చేసిన ఆమె, అదే విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు వారపత్రికలు - సాహిత్య వికాసం' అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి (Ph.D) పట్టా పొందారు
పురస్కారాలు: తెలుగు విశ్వవిద్యాలయం వారి 'కీర్తి పురస్కారం' - 'వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక అవార్డు' వంటి అనేక గౌరవాలను ఆమె గతంలో అందుకున్నారు
hmtv పురస్కారం: సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి అవార్డ్-2026'తో ఆమెను ఘనంగా సత్కరించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.