'కేటీఆర్ సర్‌.. నాకు న్యాయం చేయండి'

Update: 2019-07-27 02:19 GMT

తనను ప్రేమించి పెళ్లాడతానని మాటిచ్చిన ప్రియుడు సంవత్సరం గడుస్తున్నా ఆ ఊసెత్తకపోవడంతో ప్రియురాలు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి మొరపెట్టుకుంది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసింది. సమస్యను వివరించి తనకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. స్పందించిన కేటీఆర్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాలోని వెలటూరుకు చెందిన యువతి, కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. యువతితో సన్నిహితంగా తిరిగిన యువకుడు ఆ తర్వాత ప్లేటు మార్చాడు. దీంతో యువతి కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ పోలీసుల సమక్షంలో 20 రోజుల్లో ఆమెను పెళ్లాడతానని యువకుడు మాటిచ్చాడు. ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా మళ్లీ పెళ్లిమాట లేకపోవడంతో యువతి కేటీఆర్‌ను ఆశ్రయించింది. ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని టీఆర్ఎస్ మహిళా విభాగానికి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ భవన్‌ వద్ద కింద పడి బోరున విలపించిన ఆ యువతిని పలువురు ఓదార్చారు.

Tags:    

Similar News