డెంగ్యూతో యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం నాగాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నరేందర్రెడ్డి, మంజుల కుమార్తె భవ్య నర్సాపూర్ బీవిఆర్ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ సీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. భవ్యకు ఐదు రోజులు క్రితం డెంగీ జ్వరం సోకడంతో మెరుగగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. భవ్య ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పిన వైద్యులు.... అంతలోని చనిపోయిందని చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఎంతో ఖర్చుతో చికిత్స చేయించినప్పటికీ భవ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భవ్య ఇటీవల క్యాంపస్లో నిర్వహించిన సెలక్షన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి నియామకమై ఉద్యోగంలో చేరకముందే మృత్యువు ఒడికి చేరడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.