శంషాబాద్ సిద్దులగుట్ట సమీపంలోని బంగారు మైసమ్మ దేవాలయం సమీపములో మృతి చెందిన మహిళ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మహిళకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. మృతురాలు హైదరాబాద్ పురానాపూల్లోని బాబా బోలా దాస్ నగర్ దూల్పేట్కు చెందిన సంతోష్ సింగ్ భార్య కవితాబాయి గా పోలీసులు గుర్తించారు. ఆమె మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిందని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన కవితాబాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.