అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌గా వెంకట్‌రెడ్డి

Update: 2019-11-23 11:11 GMT
వెంకట్‌రెడ్డి

ఇటీవల మరణించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసిల్దార్ విజయారెడ్డి స్థానంలో నూతన తహసీల్దార్ ను నియమించారు. కొంత కాలంగా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్ నగర్ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జిగా బాధ్యతలు కొనసాగించారు. అనంతరం ప్రభుత్వం పూర్తి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డిని నియమించడంతో ఆయన శుక్రవారం హయత్ నగర్ లో తన బాద్యతలను చేపట్టారు.

ఈ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణ, వెంకట్‌రెడ్డికి అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే నూతన తహసీల్దార్ అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లి కార్యాలయం నిర్వహణకు మరో భవనాన్ని చూశారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలోని కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు.



Tags:    

Similar News