ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : వెంకటేష్ నాయక్
కేసీఆర్ గిరిజనులకు కేటాయిస్తానన్న 10% రిజర్వేషన్ కేటాయించక పోతే మరో ఉద్యమానికి తెర లేపుతామని గిరిజన శక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ నాయక్ హెచ్చరించారు. గిరిజన శక్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన శక్తి రాష్ట్ర మొదటి మహాసభ నిర్వహించారు. గిరిజన హక్కుల సాధన కొరకు తండా తండాకు గూడెం గుండెచప్పుడు బస్సు యాత్ర చేపట్టి గిరిజనులను ఏకం చేస్తామని వెంకటేశ్ నాయక్ తెలిపారు. డిసెంబర్ 13న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.