టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మెరుపు ధర్నాకి దిగారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ బంగ్లా ముందు ఆందోళన చేపట్టారు. మంత్రి జగదీశ్రెడ్డికి కలెక్టర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించిన ఉత్తమ్ నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ఆంధ్రా వ్యక్తంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎక్స్ అఫిషియో ఓటును కలెక్టర్ తిరస్కరించారని ఉత్తమ్ మండిపడ్డారు.