ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ

Update: 2022-09-13 12:07 GMT

 ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

AP-Telangana: ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా..మరో ఏడు ఏపికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ఈనెల 27న జరిగే సమావేశంలోని ఏజెండాలో చర్చించాల్సిన అంశాలను కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో స్సష్టం చేసింది.

Tags:    

Similar News